హామీలన్నీ నెరవేర్చాను అంటున్న జగన్ కు బాబు 10 ప్రశ్నలు

chandrababu-letter-to-jagan

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఘట్టం ముగిసేసరికి..ఏపీలో ఎన్నికల హడావిడి మొదలైంది. గత ఎన్నికల్లో విజయం సాధించిన వైసీపీ..రెండో సారి విజయం సాధించాలని సన్నాహాలు చేస్తుంటే..ఆ ఛాన్స్ రానేరాదు అంటుంది టీడీపీ – జనసేన. ప్రజలు ఒక్క ఛాన్స్ యిచ్చినందుకే రాష్ట్రాన్ని దారుణంగా మార్చారని..మరోసారి ఛాన్స్ ఇస్తే రాష్ట్ర ప్రజలు వలస వెళ్లాల్సిందే అని టీడీపీ అంటుంది. ఇక ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చ అని చెపుతున్న సీఎం జగన్ కు..చంద్రబాబు 10 ప్రశ్నలు సంధించారు.

కేంద్రం మెడలు వంచి సాధిస్తామన్న ప్రత్యేక హోదాపై ఏమంది? 2020 నాటికి పూర్తి అవ్వాల్సిన పోలవరం నాశనం చేశావని ప్రశ్నించారు. ఎన్నికలకు ముందు ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ అన్నాడా.. లేదా? ఒక్కటైనా ఇచ్చాడా?అన్నారు. టీడీపీ 14 ఏళ్లలో 11 డిఎస్సీల ద్వారా 1.50 లక్షల టీచర్ పోస్టులు భర్తీ చేశాను…ఏటా డీఎస్సీ అని హామీనిచ్చి ఐదేళ్లలో ఒక్క డీఎస్సీ పెట్టారా? అని నిలదీశారు. మద్య నిషేధం చేయకపోతే.. ఓట్లు అడగను అన్నావు.. మరి ఏ మొహం పెట్టుకుని వై ఏపీ నీడ్స్ జగన్ అని బయలు దేరావ్? అని ప్రశ్నించారు. వారంలో సీపీఎస్ రద్దు అన్నావా లేదా.. ఇంకా వారం కాలేదా? మాట మీద నిలబడడం అంటే ఇదేనా? ఉచిత ఇసుక ఇస్తాను అన్నావా లేదా? ఇచ్చావా? రాజధానిగా అమరావతికి మద్దతు ఇచ్చి ఇప్పుడు మాట తప్పావా లేదా? అని నిలదీశారు. బాదుడే బాదుడు అని నాడు రాగాలు తీసిన ముఖ్యమంత్రి.. ఛార్జీలు తగ్గిస్తానని చెప్పావా లేదా? నేడు అధికారంలోకి వచ్చిన తరవాత కరెంట్ చార్జీలు పెంచాడా లేదా? అంటూ చంద్రబాబు ప్రశ్నించారు.