బీఆర్‌ఎస్‌ పార్టీపై విజయశాంతి కీలక వ్యాఖ్యలు

Vijayashanti’s key comments on BRS party

హైదరాబాద్‌ః ఆర్ఎస్‌ పార్టీపై విజయశాంతి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో బీఆర్ఎస్ అనే పార్టీ ఇక ఉండదు అని అంటున్న బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారి అభిప్రాయం సమంజసం కాదన్నారు విజయశాంతి.
ప్రాంతీయ భావోద్వేగాలు ప్రజా మనోభావాలను వారి ఆత్మాభిమానం వైపు నడిపిస్తూనే వస్తుండడం దక్షిణాది రాష్ట్రాల సహజ విధానం అని వివరించారు.

ఎప్పటికీ..ఇది అర్ధం చేసుకోకుండా వ్యవహరించే వారికి…దక్షిణాది ……దశాబ్ధాలుగా కరుణానిధి, ఎంజీఆర్, ఎన్టీఆర్, రామకృష్ణ హెగ్డే, జయలలిత గార్ల నుండి ఇప్పటి బీఆర్ఎస్, వైసిపి దంక ఇస్తున్న రాజకీయ సమాధానం విశ్లేషించు కోవాల్సిన తప్పని అవసరం… ఎన్నడైనా.. వాస్తవం అంటూ బీఆర్‌ఎస్‌ పార్టీకి సపోర్ట్‌ గా నిలిచారు. ఈ దక్షిణాది స్వీయ గౌరవ అస్థిత్వ సత్యం కాంగ్రెస్ అర్థం చేసుకున్నట్లు, బీజేపీ కనీసం ఆలోచన చెయ్యని అంశం బహుశా కిషన్ రెడ్డి గారి ప్రకటన భావం అని ఫైర్ అయ్యారు విజయశాంతి.