పార్టీ మారుతుందన్న వార్తలపై క్లారిటీ ఇచ్చిన విజయశాంతి

మాజీ ఎంపీ విజయశాంతి బిజెపి పార్టీ మారుతుందని , త్వరలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోబోతుందని , అందుకే బిజెపి ని విమర్షిస్తూ..కాంగ్రెస్ను పొగుడుతుందని సోషల్ మీడియా లో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. ఈ ప్రచారాన్ని చూసి చాలామంది నిజమే కావొచ్చని భావిస్తున్నారు. ఈ తరుణంలో ఆమె ట్విట్టర్ వేదికగా పార్టీ మారడం ఫై క్లారిటీ ఇచ్చారు.

తాను పార్టీ మారుతానంటూ వస్తున్న వార్తలను ఖండిస్తున్నానన్నారు. కొంతమంది తమ పార్టీ నేతలే పనిగట్టుకొని రాములమ్మ బీజేపీకి దూరం అంటూ ప్రచారం చేయిస్తున్నారని ఆరోపించారు. చిట్ చాట్ ల పేరుతో ఏదో ఒక వ్యూహంతో చేసే కార్యాచరణ తనకు అలవాటు లేదన్నారు. పార్టీ కి ఏది ముఖ్యమో ఆ అంశాలను పార్టీ ప్రధాన నాయకులకు ఈ నెల 16 న ముఖ్య సమావేశంలో స్పష్టంగా తెలియజేశానన్నారు. అంతర్గత విషయాలు బయటకు లీకేజ్ ల పేరుతో ఇవ్వడానికి తాను వ్యతిరేకిస్తానన్నారు.