నారా లోకేష్ కు విజయసాయి రెడ్డి విషెష్

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి , నారా చంద్రబాబు తనయుడు నారా లోకేష్ పుట్టిన రోజు నేడు. ఈ సందర్బంగా వైస్సార్సీపీ నేత విజయసాయి రెడ్డి ట్విట్టర్ ద్వారా లోకేష్ బర్త్ డే విషెష్ తెలిపారు. నారా లోకేష్ కు శ్రీవారి ఆశీర్వాదాలు ఉండాలని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ట్వీట్ చేశారు. అలాగే మరో ట్వీట్ లో రిపబ్లిక్ డే వేడుకల గురించి ప్రస్తావించారు. రిపబ్లిక్ డే వేడుకలకు రాష్ట్ర ప్రభుత్వ శ్రద్ధతో ఎంపికైన కోనసీమ ప్రభలతీర్థం శకటం 400 ఏళ్ల విశిష్ట సంస్కృతి ఇతివృత్తంతో ‘రైతే రాజు’ అని చాటి చెబుతూ, పాడిపంటలతో ఎడ్లబండిలో ఉన్న రైతన్నతో శకటం రూపకల్పన. దేశ, విదేశాంగ ప్రతినిధుల ముందు ప్రదర్శించే సదవకాశం అని పేర్కొన్నారు.

ఇక లోకేష్ పుట్టిన రోజు సందర్బంగా రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నేతలు , కార్యకర్తలు , అభిమానులు బర్త్ డే సంబరాలు జరుపుతున్నారు. ఉదయం నుండే పెద్ద ఎత్తున కేక్స్ కట్ చేస్తూ భారీ ప్లెక్సీ లు , కట్ అవుట్ లు ఏర్పాటు చేసి తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. అలాగే రక్త దానాలు చేయడం , పేదలకు పండ్లు , దుప్పట్లు అందజేయడం వంటివి చేస్తూ వస్తున్నారు.

గుంటూరుజిల్లా తెనాలి సమీపంలోని కూచిపూడి గ్రామానికి చెందిన రైతు, టిడిపి జాతీయ కార్యదర్శి లోకేష్ పుట్టినరోజును వినూత్న రూపంలో చాటారు. ఎకరం పొలంలో వరినారుతో నారాలోకేష్ ముఖ చిత్రం ఆకారంలో పంటను పండించారు. దాదాపు వంద రోజులపాటు ఈ పంటను జాగ్రత్తగా పెంచారు లోకేష్‌ వీరాభిమాని పులి చిన్నా. ఇక పండిన వరిని కోసి ఆ ధాన్యాన్ని లోకేష్‌ తల్లి భువనేశ్వరికి అందిస్తానని తెలిపారు.

ఇక ఈ నెల 27 న కుప్పం నుండి లోకేష్ యాత్ర మొదలుకాబోతుంది. రోజుకు 10 కిలోమీటర్ల చొప్పున 400 రోజులపాటు 4వేల కిలోమీటర్లు నడవబోతున్నారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో యాత్ర ముగుస్తుంది. ఈ యాత్రలో దాదాపు రాష్ట్రంలోని ముఖ్యమైన నియోజకవర్గాన్నింటినీ కవర్ చేయనున్నారు.