ఢిల్లీలో ప్రధాని మోడీ తో విజయసాయి భేటీ

ఏపీకి సంబంధించిన వివిధ అంశాలపై చర్చ

అమరావతి: వైస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి నేడు ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీని కలిశారు. మోడీకి శాలువా కప్పి సన్మానించి విజయసాయి, ఆయనకు వినాయకుడి ప్రతిమను అందజేశారు. ఈ మేరకు ట్విట్టర్ లో వెల్లడించారు. ప్రధానిని కలిసి ఏపీకి సంబంధించిన అనేక అంశాలపై చర్చించినట్టు విజయసాయి తెలిపారు.

అంతకుముందు, విజయసాయిరెడ్డిని ఆయన కార్యాలయంలో ఈ ఉదయం కొందరు తెలుగు విద్యార్థులు కలిశారు. వారు ఢిల్లీ యూనివర్సిటీలో విద్యాభ్యాసం చేస్తున్నారు. మన తెలుగు విద్యార్థులను కలవడం ఆనందంగా ఉందని విజయసాయి ఓ ట్వీట్ లో పేర్కొన్నారు. ఢిల్లీ వర్సిటీలో చదువుకుంటున్న ఆ తెలుగు విద్యార్థులు అదే సమయంలో సివిల్స్ కు సన్నద్ధమవుతున్నారని వెల్లడించారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/international-news/