పురందేశ్వరి ఢిల్లీ పర్యటనపై విజయసాయి విమర్శలు
రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్టుల కోసం ఢిల్లీకి వెళ్తే బాగుండేదని వ్యాఖ్య
అమరావతిః ఏపీ బిజెపి అధ్యక్షురాలు పురందేశ్వరి ఢిల్లీ పర్యటనపై వైఎస్ఆర్సిపి రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి విమర్శలు గుప్పించారు. ఏపీకి రావాల్సిన ప్రాజెక్టుల కోసమో లేదా కనీసం మీ పార్టీ అభివృద్ధి కోసమో ఢిల్లీ యాత్రలు చేస్తే బాగుండేదేమో చెల్లెమ్మా పురందేశ్వరి అని ఆయన ఎద్దేవా చేశారు. అవినీతి చేసి అరెస్టైన మీ బావ చంద్రబాబు కోసం ప్రయాస ఎందుకని అన్నారు. ఒక జాతీయ పార్టీలో ఉన్నానన్న కనీస స్పృహ లేకుండా మీరు చేస్తున్న డిమాండ్లను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని చెప్పారు.