ఆర్మీ జవాన్ కాల్పులు.. ముగ్గురు మృతి
దక్షిణ కివు: డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలోని దక్షిణ కివు ప్రావిన్స్ ఫిజి ప్రాంతంలో ఆర్మీ జవాన్ విచక్షణ కోల్పోయి జనాలపైకి కాల్పులు జరిపాడు. కాల్పుల్లో ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. ఇద్దరికి గాయాలైనట్లు స్థానిక మీడియా తెలిపింది. మృతుల్లో ఒకరు సైనికుడని, మిగిలిన ఇద్దరు సాధారణ పౌరులని వెల్లడించింది. గాయపడిన ఇద్దరిని స్థానికులు చికిత్స నిమిత్తం సమీప దవాఖానకు తరలించారు. కాల్పులకు పాల్పడిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దాడికి గల ఉద్దేశం తెలియదని అధికారులు తెలిపారు. నిందితుడిని విచారిస్తున్నామని, త్వరలో అన్ని వివరాలు వెల్లడిస్తామని పేర్కొన్నారు.
తాజా ఎడిటోరియల్ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/editorial/