భారీ ధర పలికిన విజయ్ దేవరకొండ ‘ఖుషి’ నాన్ థియేట్రికల్ రైట్స్‌‌ ..

విజయ్ దేవరకొండ – సమంత జంటగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ఖుషి. ఇప్పటికే సగానికి పైగా షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ మూవీ డిసెంబరులో ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా.. సమంత అనారోగ్యం బారినపడడం, లైగర్ ప్లాప్ తర్వాత విజయ్ దేవరకొండ కాస్త బ్రేక్ తీసుకోవడంతో వచ్చే ఏడాది ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

ఈ క్రమంలో ఈ చిత్ర నాన్ థియేట్రికల్ రైట్స్‌‌ భారీ ధరకు అమ్ముడైనట్లు తెలుస్తుంది. ‘ఖుషీ’ మూవీ ఆల్ లాంగ్వేజెస్ నాన్ థియేట్రికల్ రైట్స్‌‌ రూ.90 కోట్లకి అమ్ముడుపోయాయట. ఈ మేరకు ఇండస్ట్రీ ట్రాకర్ రమేశ్ బాల ఓ ట్వీట్ ద్వారా ఈ విషయాన్ని తెలియజేశాడు. ఇక రీసెంట్ గా విజయ్ దేవరకొండ పూరి డైరెక్షన్లో లైగర్ మూవీ చేసాడు. బాక్సింగ్ నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం భారీ డిజాస్టర్ అయ్యింది. ఈ మూవీ ఎఫెక్ట్ ఖుషి ఫై పడుతుందని అంత అనుకున్నారు కానీ..నాన్ థియేట్రికల్ రైట్స్‌‌ భారీ ధర పలకడంతో ఆ ఎఫెక్ట్ ఏమిలేదని అంటున్నారు.