తెలంగాణ గవర్నర్‌ తమిళిసై ని కలిసిన అలీ

సినీ నటుడు , ఏపీ ఎలక్ట్రానిక్‌ మీడియా సలహాదారుడు అలీ ..తెలంగాణ గవర్నర్‌ తమిళిసై ని కలిశారు.అలీ పెద్ద కుమార్తె ఫాతిమా వివాహం ఇటీవలే నిశ్చయమైంది. ఈ సందర్భంగా వివాహ ఆహ్వాన పత్రిక ప్రతికను గవర్నర్‌ కు అందజేసి వివాహానికి రావాలని ప్రత్యేకంగా ఆహ్వానించారు. పెళ్లిపత్రికను స్వీకరించిన తమిళిసై తప్పకుండా వివాహానికి హాజరవుతానని అలీకి మాటిచ్చారు. మెడిసిన్ పూర్తి చేసిన ఫాతిమా ఎంగేజ్మెంట్ ఇటీవలే గ్రాండ్ గా జరిగింది. షేక్ షెహ్యాజ్ అనే వ్యక్తితో ఫాతిమా పెళ్లి త్వరలో జరగనుంది. షేక్ షెహ్యాజ్ డాక్టర్ గా పనిచేస్తున్నాడు.

ఇక అలీ విషయానికి వస్తే రీసెంట్ గా ఏపీ ప్రభుత్వం అలీని ఎల‌క్ట్రానిక్ మీడియా స‌ల‌హాదారుగా నియమించింది. సోమవారం అలీ తన బాధ్యతలను స్వీకరించారు. అధికారులు వెంట రాగా తన చాంబర్ లో ప్రవేశించారు. ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్ చేతుల మీదుగా బాధ్యతలు అందుకున్నారు. ఈ సందర్భంగా అలీ మాట్లాడుతూ.. తనను ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుగా నియమించడం పట్ల సీఎం జగన్ కు కృతజ్ఞతలు తెలిపారు. తనపై సీఎం జగన్ ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని అన్నారు.