కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పై వి.హనుమంత రావు ఆగ్రహం

కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి..కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంత రావు ఆగ్రహం వ్యక్తం చేసారు. మునుగోడు ప్రచారానికి వెంకట్ రెడ్డి దూరంగా ఉండడం పట్ల పలు ప్రశ్నలు చిందించారు. రాజకీయాల్లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎన్నో త్యాగాలు చేశారని .. అలాంటి వ్యక్తి ఎవరో తిట్టారని సైలెంట్ గా ఉండడం సరికాదన్నారు. వెంకటరెడ్డిని టిఆర్ఎస్ నేతలు కోవర్ట్ రెడ్డి అనడం బాధ కలిగించిందన్నారు. స్టార్ క్యాంపెయినర్ గా ఉండి ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొనక పోవడం విమర్శలకు తావిస్తోందని వి.హనుమంత రావు ఆవేదన వ్యక్తం చేసారు. ఇప్పుడు వెంకట్ రెడ్డి విదేశాలకు వెళ్ళడం సరికాదన్నారు. ఇలాంటి ప్రవర్తన వల్ల టీఆర్ఎస్ నేతలు కోవర్ట్ రెడ్డి అంటున్నారని వి.హనుమంత రావు ఆందోళన వ్యక్తం చేసారు. వెంకట్ రెడ్డి మునుగోడు ప్రచారానికి వెళ్ళక పోతే, కోవర్ట్ రెడ్డి అనేది నిజమౌతుందని వి.హనుమంత రావు పేర్కొన్నారు.

రైతంగ సమస్యలపై రేవంత్ రెడ్డితో కలిసి ఉద్యమించిన నీవు యూనిటీని దెబ్బతీయద్దన్నారు. మునుగోడు ఉపఎన్నిక అయిపోయిన తర్వాత ఎక్కడికైనా వెళ్ళు.. కానీ ప్రచారం చేయకుండా విదేశాలకెళితే ఎన్నారైలంతా నిన్ను ప్రశ్నిస్తారని అన్నారు. సోనియా గాంధీ తన ఆరోగ్యాన్ని సైతం లెక్కచేయకుండా రాహుల్ గాంధీ పాదయాత్రలో పాల్గొందని..సోనియాగాంధీ అంత చేస్తుంటే మనం ఇంకెంత చేయాలో ఆలోచించాలని అన్నారు.