ఆంధ్ర యూనివర్శిటీ ఇంజినీరింగ్ గ్రౌండ్స్లో వాల్తేర్ మెగా ఈవెంట్
ఏపీ సర్కార్ తీసుకొచ్చిన జీవో 1 రాజకీయ పార్టీలకే కాదు సినీ ఫంక్షన్ లకు కూడా ఇబ్బంది గా మారింది. ఇప్పటికే ఈ జీవో కారణంగా వీరసింహరెడ్డి ప్రీ రిలీజ్ వేదికగా చేంజ్ కాగా ..ఇప్పుడు వాల్తేర్ వీరయ్య ప్రీ రిలీజ్ ఈవెంట్ సైతం మారింది. మెగాస్టార్ చిరంజీవి – రవితేజ కలయికలో శృతి హాసన్ హీరోయిన్ గా బాబీ డైరెక్షన్లో తెరకెక్కిన వాల్తేర్ వీరయ్య మూవీ జనవరి 13 న భారీ ఎత్తున విడుదల కాబోతుంది. ఈ క్రమంలో ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ గా వైజాగ్ RK బీచ్ లో గ్రాండ్ జరపాలని మేకర్స్ ప్లాన్ చేసుకున్నారు. దానికి తగ్గట్లే ఏర్పాట్లు చేసారు. కానీ ఇంతలో ఏపీ సర్కార్ జీవో 1 ను తీసుకొచ్చి , RK బీచ్ లో ఈవెంట్ జరపడకూడదని తెలుపడం తో మేకర్స్ ఆలోచనలో పడ్డారు.
ఇక చేసేది ఏమిలేక వేదికను మార్చేశారు. ఆంధ్ర యూనివర్శిటీ ఇంజినీరింగ్ గ్రౌండ్స్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ను నిర్వహించాలంటూ అధికారులు నిర్వాహకులకు సూచనలు చేశారు. ఆ మేరకు నిర్వాహకులు ఇప్పుడు అక్కడ ఫ్యాన్స్, ప్రేక్షకుల కోసం ఏర్పాటు చేసుకుంటున్నారు. జనవరి 08 న ఈ ఈవెంట్ జరగనుంది. మరోపక్క సెన్సార్ సహా అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. 2 గంటల 40 నిమిషాల రన్ టైమ్తో యు/ఎ సర్టిఫికేట్ను సంపాదించుకుంది. దేవి అందించిన సాంగ్స్ శ్రోతలను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇక రేపు ఈ చిత్ర ట్రైలర్ విడుదల కాబోతుంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్పై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.