విషాదం లో వారసుడు మూవీ యూనిట్

వారసుడు మూవీ టీం విషాదం లో పడింది. వారసుడు చిత్రానికి ఆర్ట్ డైరెక్టర్ గా వర్క్ చేసిన సునీల్ బాబు గుండెపోటుతో మరణించారు. గుండెపోటు తో కేరళలోని ప్రవైట్ హాస్పటల్ లో చేరిన సునీల్ చికిత్స తీసుకుంటూ మరణించాడు. తమిళ్ హీరో విజయ్ – రష్మిక జంటగా వంశీ పైడిపల్లి డైరెక్షన్లో దిల్ రాజు నిర్మిస్తున్న పాన్ ఇండియా మూవీ వారసుడు (తమిళంలో వారిసు). సెన్సార్ స‌హా అన్నీ కార్య‌క్రమాల‌ను పూర్తి చేసుకుని ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరి 11న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ప్రస్తుతం చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్య క్రమాల్లో బిజీ గా ఉండగా..ఈ చిత్రానికి ఆర్ట్ డైరెక్టర్ గా వర్క్ చేసిన సునీల్ బాబు మరణం చిత్ర యూనిట్ ను విషాదం లో పడేసింది.

కేర‌ళ రాష్ట్రానికి చెందిన సునీల్.. సౌత్‌లో ప‌లు చిత్రాల‌కు ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్‌గా వ్య‌వ‌హ‌రించారు.మూడు రోజుల ముందు సునీల్ బాబు కాలి నుంచి చీము లాంటి ద్ర‌వం రావ‌టంతో ఆయ‌న్ని ఎర్నాకులంలోని ఓ ప్రైవేట్‌ హాస్పిట‌ల్‌లో చేర్పించారు. ట్రీట్‌మెంట్ తీసుకుంటున్న స‌మ‌యంలో గుండె పోటు రావ‌టంతో ఆయ‌న గురువారం రాత్రి క‌న్నుమూశారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఆయ‌న 100 సినిమాల‌కు పైగానే ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్‌గా వ‌ర్క్ చేశారు. గ‌త ఏడాది తెలుగు స‌హా హిందీ, మ‌ల‌యాళంలో ఘ‌న విజ‌యం సాధించిన సీతా రామం సినిమాకు సునీల్‌నే ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్‌. మైసూర్ ఆర్ట్స్ కాలేజ్‌లో చదివిన ఆయ‌న సాబు సిరిల్ ద‌గ్గ‌ర అసిస్టెంట్‌గా వ‌ర్క్ చేశారు. ఈయన మరణ వార్త యావత్ చిత్ర సీమను షాక్ లో పడేసింది.