ప్రభాస్ కు కోపం వస్తే ఫస్ట్ చేసే పని అదేనట

బాహుబలి మూవీ తో పాన్ ఇండియా స్టార్ గా పాపులార్టీ సాధించుకున్న ప్రభాస్..ప్రస్తుతం వరుస పాన్ ఇండియా మూవీస్ చేస్తున్నాడు. తాజాగా బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ సీజన్ 2 లో తన ఫ్రెండ్ గోపీచంద్ తో కలిసి హాజరయ్యాడు. దీనిని రెండు ఎపిసోడ్ గా ఆహా స్ట్రీమింగ్ చేసింది. మొదటి ఎపిసోడ్ డిసెంబర్ 30 న చేయగా..సెకండ్ ఎపిసోడ్ ఈరోజు (జనవరి 06) నుండి అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ రెండో ఎపిసోడ్ కూడా మొదటి ఎపిసోడ్ కు మించేలా ఉంది.

ఫస్ట్ ఎపిసోడ్ సరదా, సరదా గా సాగిపోగా..రెండో ఎపిసోడ్ ఎమోషనల్ గా , ప్రభాస్ , గోపీచంద్ ల మధ్య ఉన్న స్నేహం గురించి తెలిపింది. ఈ ఎపిసోడ్ లో బాలకృష్ణ ప్రభాస్ కు కోపం వస్తే ఏంచేస్తాడు..గోపీచంద్ కు కోపం వస్తే ఏంచేస్తాడు అనే ప్రశ్నలను ఇరువురిని అడిగాడు. ముందుగా ప్రభాస్ సమాధానం ఇచ్చారు.

“ఒకసారి గోపీచంద్ ముక్కుకి దెబ్బ తగిలింది. నవ్వొచ్చినప్పుడు పక్కవారి భుజంపై కొట్టడం నాకు అలవాటు. అలా మాత్రం కొట్టొద్దని గోపీచంద్ నాకు ముందుగానే చెప్పాడు. కానీ కలిసి కారులో వెళుతూ ఉండగా నాకు నవ్వు రాగానే నేను అతని భుజంపై గట్టిగానే కొట్టాను .. అంతే పాపం ముక్కులో నుంచి రక్తం వచ్చేసింది. అప్పుడు కూడా తను నన్ను ఏమీ అనలేదు. తనకి కోపం రాదు .. చాలా మంచోడు” అని అన్నాడు.

ఇక ప్రభాస్ కి కోపం వచ్చినప్పుడు ఏం చేస్తాడు? ఎలా ప్రవర్తిస్తాడు? అని గోపీచంద్ ను బాలయ్య అడిగారు. అందుకు ఆయన స్పందిస్తూ .. ” ప్రభాస్ కి కోపం వస్తే తనచుట్టూ ఉన్నవారిని వెంటనే అక్కడి నుంచి వెళ్లిపొమ్మంటాడు .. గెటవుట్ అనేస్తాడు. ఒంటరిగా కూర్చుని ఆలోచిస్తూ ఉండిపోతాడు” అని చెప్పుకొచ్చాడు. ఆ మాటలకి ప్రభాస్ నవ్వేశాడు.

అలాగే ప్రభాస్ పెదనాన్న రెబల్ స్టార్ కృష్ణంరాజు ప్రస్తావన వచ్చినప్పుడు ప్రభాస్ కూడా స్టేజీ మీద ఎమోషనల్ అయిపోయాడు. ప్రభాస్‌తో పాటు బాలకృష్ణ కళ్లలో కూడా నీళ్లు తిరిగాయి. గోపిచంద్‌ను ప్రభాస్ పెళ్లి గురించి బాలకృష్ణ అడగ్గా, వచ్చే సంవత్సరం ఉండవచ్చేమో అని గోపిచంద్ సమాధానం ఇవ్వడం.. ఆ తర్వాత ప్రభాస్, గోపిచంద్‌లతో బాలకృష్ణ ఒక గేమ్ ఆడడం సరదాగా సాగింది.