ఆగస్టు 24న వరుణ్ – లావణ్య ల వివాహం..?

వరుణ్ తేజ్ – లావణ్య త్రిపాఠి ల వివాహ తేదీ ఫిక్స్ అయ్యిందా..? ప్రస్తుతం ఫిలిం సర్కిల్లో ఇదే చర్చ నడుస్తుంది. ఆగస్టు 24 న వీరి వివాహం జరిపేందుకు ఇరు కుటుంబ సభ్యులు నిర్ణయించారని తెలుస్తుంది. గత కొంతకాలంగా ప్రేమలో ఉన్న వీరిద్దరూ..ఇరు కుటుంబ సభ్యులను ఒప్పించి పెళ్లికి సిద్ధమయ్యారు. రీసెంట్ గా హైదరాబాద్ లోని నాగబాబు ఇంట్లో నిశ్చితార్థ వేడుక జరిగింది. ఈ వేడుకకు చిరంజీవి దంపతులు , పవన్ కళ్యాణ్ , అల్లు అర్జున్ , సాయి ధరమ్ తేజ్ మొదలగు వారు హాజరయ్యారు.

ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలు ఇప్పటికీ సోషల్ మీడియాలో సందడి చేసాయి. వరుణ్ తేజ్ -లావణ్య త్రిపాఠి మొదటిసారిగా 2017లో ‘మిస్టర్’ సెట్స్ లో కలుసుకున్నారు. షూటింగ్ సమయం లో ఇరువురి మధ్య స్నేహం పెరిగింది..ఆ స్నేహం కాస్త ప్రేమకు దారితీసింది. ఈ జంట రెండవ చిత్రం అంతరిక్షం 9000 KMPH చిత్రీకరణ సమయం లో డేటింగ్ చేస్తున్నారనే వార్త వెలుగు లోకి వచ్చింది. చివరికి వరుణ్ తేజ్-లావణ్య కలిసి బహిరంగంగా కనిపించడం ప్రారంభించారు. ఇక ఇప్పుడు వివాహం బంధం తో ఒకటి కాబోతున్నారు.

ఆగస్టు 24న మూడు మూళ్ల బంధంతో వీరు ఒకటి కాబోతున్నట్లు సమాచారం. ఇటలీ లో వరుణ్ తేజ్‌, లావణ్య త్రిపాఠి డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకునేందుకు ప్లాన్ చేసుకున్నారు. ఇప్పటికే ఇద్దరూ కలిసి పెళ్లి షాంపింగ్ కూడా స్టార్ట్ చేశారట. ఇదే నిజమైతే త్వరలోనే మెగా ఇంట పెళ్లి సంబరాలు షురూ కావడం ఖాయం.