పవన్ కళ్యాణ్ ఫై రెచ్చిపోయిన వర్మ

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫై మరోసారి దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రెచ్చిపోయారు. గత కొద్దీ కాలంగా వర్మ ..సినిమాలు చేయడం మానేసి వైస్సార్సీపీ కి పనిచేయడం మొదలుపెట్టారు. వైస్సార్సీపీ కి , జగన్ కు మద్దతుగా మాట్లాడడం , సినిమాలు చేయడం చేస్తున్నారు. ఇదే క్రమంలో వైస్సార్సీపీ ప్రభుత్వం ఫై ఎవరైనా విమర్శలు చేసిన వారిపై ట్విట్టర్ వేదికగా విమర్శలు చేస్తూ వస్తున్నారు.

తాజాగా నిన్న అవనిగడ్డ సభలో పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ ఫై వర్మ స్పందించారు. ‘జగన్మోహన్ రెడ్డి ఆడే ఆటలో నీవు కేవలం ఒక బంటువు మాత్రమే పవన్ కల్యాణ్’ అని ఆయన ఎద్దేవా చేశారు. రాజు దాకా అవసరం లేదు… ఏనుగులు, గుర్రాలతో నిన్ను ఆయన తొక్కించేస్తాడని ఎక్స్ వేదికగా కామెంట్ చేశారు. ఈ వ్యాఖ్యలపై టీడీపీ శ్రేణులతో పాటు జనసేన శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

https://twitter.com/RGVzooi/status/1708512992219000900