చిరంజీవి – బాలయ్య ల కోసం మనసు మార్చుకున్న దిల్ రాజు

మొత్తానికి దిల్ రాజు ఓ మెట్టు దిగాడు. తాను నిర్మించిన వారసుడు చిత్రాన్ని జనవరి 11 న కాకుండా 14 న రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. చిరంజీవి ..బాలకృష్ణ ల కోసమే సినిమా ను వెనక్కి జరిపినట్లు తెలిపారు. విజయ్ – రష్మిక జంటగా వంశీ పైడిపల్లి డైరెక్షన్లో దిల్ రాజు నిర్మిస్తున్న వారసుడు మూవీ …జనవరి 11 న తెలుగు, తమిళ్ భాషల్లో విడుదల చేస్తున్నట్లు ప్రకటించాడు. ఈ ప్రకటన వెలువడిన దగ్గరి నుండి దిల్ రాజు ఫై మెగా , నందమూరి అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ వచ్చారు. ఇద్దరు అగ్ర హీరోల సినిమాలు వస్తున్న క్రమంలో తమిళ్ చిత్రాన్ని రిలీజ్ చేయడం ఏంటి అని ప్రశ్నించారు. ఎంతమంది ఎన్ని విమర్శలు చేసిన దిల్ రాజు తగ్గలేదు. కానీ తీరా రిలీజ్ దగ్గరికి వచ్చిన సమయంలో మనసు మార్చుకుని , మెగా , నందమూరి అభిమానులకు ఆనందం నింపారు.

నేను గత కొన్ని రోజులుగా నా మనసులో ఈ విషయాన్ని అనుకుంటున్నాను. నా చుట్టు ఉన్న వారు.. నా ఆఫీస్ వారు ఈ విషయాన్ని రెండు మూడు రోజుల క్రితమే లీక్ చేశారు అంటూ దిల్ రాజు వ్యాఖ్యలు చేశాడు.

తెలుగు లో చిరంజీవి గారు మరియు బాలకృష్ణ గారు పెద్ద హీరోలు. వారికి సాధ్యం అయినన్ని ఎక్కువ థియేటర్లు లభించాల్సి ఉంది. అందుకే వారి సినిమాల తర్వాతే నా సినిమా విడుదల కావాలనే ఉద్దేశ్యంతో జనవరి 14వ తారీకున నా వారసుడు సినిమాను తీసుకు రాబోతున్నట్లుగా పేర్కొన్నాడు.

మా బ్యానర్ లో గతంలో వచ్చిన సంక్రాంతి ఫ్యామిలీ ఎంటర్ టైనర్స్ మాదిరిగానే ఈ సినిమా కూడా తప్పకుండా తెలుగు ప్రేక్షకులను అలరిస్తుందని దిల్ రాజు నమ్మకం వ్యక్తం చేశారు. చాలా మందితో చర్చించిన తర్వాత.. చాలా ఆలోచించిన తర్వాత ఈ నిర్ణయం ను తీసుకున్నట్లుగా దిల్ రాజు చెప్పుకొచ్చాడు.