వీరసింహరెడ్డి ఫస్ట్ రివ్యూ వచ్చేసింది

నందమూరి బాలకృష్ణ నటిస్తున్న వీరసింహరెడ్డి మూవీ తాలూకా ఫస్ట్ రివ్యూ వచ్చేసింది. క్రాక్ ఫేమ్ గోపిచంద్ మలినేని డైరెక్షన్లో మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో తెరకెక్కిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ జనవరి 12 న సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే ఈ సినిమా తాలూకా సాంగ్స్ , టీజర్ , ట్రైలర్ ఇలా ప్రతిదీ సినిమా ఫై అంచనాలు రెట్టింపు చేసింది.

ఇక ఇప్పుడు సినిమా తాలూకా ఫస్ట్ రివ్యూ వచ్చి…సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అనే ఆత్రుత పెంచింది. ప్రముఖ దుబాయ్ సెన్సార్ సభ్యుడు ఉమైర్ తన సోషల్ మీడియా ఖాతాలో వీర సింహ రెడ్డి తాలూకా ఫస్ట్ రివ్యూ ఇచ్చాడు. ‘‘సినిమాకు బాలకృష్ణ మూలస్తంభంలా నిలబడ్డారు. ఆయన మరో వైవిధ్యమైన పాత్రలో కనిపించడమే కాకుండా అద్భుతమైన నటనను కనబరిచారు. మాస్ ఆడియన్స్‌ను బాలకృష్ణ తన పంచ్ డైలాగులతో అలరించడే కాదు.. కొన్ని సన్నివేశాల్లో తన భావోద్వేగ నటనతో కన్నీళ్లు పెట్టించారు. అలాగే ఈ స్టార్ హీరో డాన్సులు కుమ్మేశారు. పాటలకు ఆయన అభిమానులకు పండగ వాతావరణాన్ని తీసుకొస్తాయి. నాన్ స్టాప్ యాక్షన్ స్టంట్స్! స్టోరీ, స్క్రీన్‌ప్లే కొత్తగా ఏమీ లేకపోయినప్పటికీ సినిమా ఎంగేజింగ్‌గా, టైంపాస్ అయ్యే విధంగా ఉంది. టర్కీ లొకేషన్స్‌ను అద్భుతంగా చూపించారు. శృతిహాసన్ మరోసారి కట్టిపడేసింది. ఆఖరి 15 నిమిషాలు సినిమా అద్భుతం. మొత్తంగా చూసుకుంటే ఇది పైసా వసూల్ మాస్ మూవీ’’ అని ఉమైర్ సంధు తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేసారు. ఇక సినిమా కు 3 .5 /5 రేటింగ్ ఇచ్చాడు.

ఇక ప్రస్తుతం ఈ సినిమా సెన్సార్ కార్య క్రమాలు పూర్తి చేసుకున్నట్లు తెలుస్తుంది. సినిమాను చూసిన సెన్సార్ బృందం సినిమాకు యూ/ఏ సర్టిఫికెట్ ఇచ్చినట్లు తెలుస్తుంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో తెరకెక్కిన ఈ చిత్రంలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా థమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు.