ప్రెస్ మీట్ లో నోరు జారిన వంగలపూడి అనిత…మళ్లీ జగనే సీఎం కావాలనేసింది
పబ్లిక్ మీటింగ్ లలో, ప్రెస్ మీట్ లలో ఒక్కోసారి రాజకీయ నేతలు నోరు జారడం కామన్. తాజాగా టీడీపీ మహిళా నేత, తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత సైతం అలాగే నోరు జారీ, వైస్సార్సీపీ వారికీ చిక్కింది. సీఎం జగన్ ఫై విమర్శలు చేసే క్రమంలో అనుకోకుండా మళ్లీ జగనే సీఎం కావాలంటూ వ్యాఖ్యానించడం సంచలనంగా మారింది. దాంతో వైస్సార్సీపీ కార్యకర్తలు, నేతలు.. టీడీపీ వాళ్లు కూడా జగనే మరో సారి సీఎం కావాలని కోరుకుంటున్నారు.. ఇది మా జగనన్న పని తీరు.. ఆయనపై వారికున్న నమ్మకం అంటూ.. అనిత మాట్లాడిన వీడియోని వైరల్ చేస్తున్నారు.
ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మొదలు ప్రతి దాంట్లో ఏపీని నంబర్ వన్గా నిలిపిన చంద్రబాబు నాయుడు మళ్లీ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలి. అప్పుడే పరిస్థితులు మారుతాయి. రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. పొరపాటున.. కలలో కూడా ఊహించుకోవద్దు.. జగన్ సీఎం కాకూడదు అంటూనే.. మళ్లీ జగన్ను సీఎం చేసే బాధ్యత మన మీదే ఉందంటూ.. వంగలపూడి అనిత చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్గా మారాయి.