కూకట్ పల్లిలో విషాద ఘటన

హైదరాబాద్ లోని కూకట్ పల్లిలో విషాద ఘటన చోటుచేసుకుంది. నిర్మాణంలో ఉన్న భవనం స్లాబ్ కూలి ఇద్దరు కూలీలు మృతి చెందారు. సదరు భవన యజమాని జీ ప్లస్ 2 అనుమతి తీసుకుని ఐదంతస్తుల నిర్మాణం జరుపుతుండగా..ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటన లో మృతి చెందిన వారిని ఆనంద్, దయ అని వీరిద్దరూ యూపీకి చెందిన కూలీలుగా గుర్తించారు. వారి మృతదేహాలను వెలికితీసి గాంధీ ఆసుపత్రికి తరలించారు. యజమానిపై కేసు నమోదు చేస్తామని అధికారులు అంటున్నారు.

ఈ ఘటన తర్వాత కూకట్ పల్లి లో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలు వస్తున్నాయని గమనించి డ్రైవర్ పక్కన ఆపేలోపే అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. దీంతో.. డ్రైవర్‌ సహా బస్సులో ఉన్న ప్రయాణికులంతా ఒక్కసారిగా బయటకు దూకేశారు. ఆ తర్వాత.. చూస్తున్నంత సేపట్లోనే బస్సు పూర్తిగా దగ్ధమైపోయింది. పెద్ద ఎత్తున చెలరేగిన అగ్నికీలలను చూసి ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలంతా భయాందోళనకు గురయ్యారు. అగ్నిమాపక సిబ్బంది చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు.