టీఆర్ఎస్ ఎంపీల ఆందోళన.. రాజ్యసభ వాయిదా
uproar-in-rajya-sabha-adjourned-till-12-00-noon
న్యూఢిల్లీ : రాజ్యసభ వరుసగా మూడో రోజు కూడా విపక్ష సభ్యుల ఆందోళనలతో అట్టుడికింది. టీఆర్ఎస్ ఎంపీలతోపాటు ఇతర పార్టీల ఎంపీలు కూడా ధాన్యం సేకరణ, పంటలకు కనీస మద్దతు ధర, ఆందోళనల్లో మరణించిన రైతులకు పరిహారం విషయమై సభలో నినాదాలు చేశారు. టీఆర్ఎస్ ఎంపీలు ఛైర్మన్ పోడియాన్ని చుట్టుముట్టారు. ధాన్యం సేకరణపై కేంద్రం సమగ్ర విధానం తీసుకురావాలని డిమాండ్ చేశారు. విపక్షాల ఆందోళనలతో సభలో గందరగోళం నెలకొనడంతో ఛైర్మన్ రాజ్యసభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు.
తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/