ల్యాండ్ ఫర్ జాబ్ స్కాం కేసు..వీల్ చైర్‌లో కోర్టుకు హాజ‌రైన లాలూ

lalu-prasad-yadav-arrived-at-rouse-avenue-court-in-wheel-chair-in-connection-with-land-for-job-case

న్యూఢిల్లీః మాజీ రైల్వేశాఖ‌ మంత్రి లాలూ ప్ర‌సాద్ యాద‌వ్‌ ల్యాండ్ ఫ‌ర్ జాబ్ కేసులో ఈరోజు ఢిల్లీలోని రోజ్ అవెన్యూ కోర్టుకు హాజ‌ర‌య్యారు. వీల్ చైర్‌లో ఆయ‌న కోర్టు రూమ్‌కు వెళ్లారు. ఆయ‌న‌తో పాటు ఆయ‌న భార్య ర‌బ్రీ దేవి, కుమార్తె, ఎంపీ మీసా భార‌తి కూడా కోర్టుకు హాజ‌ర‌య్యారు. రైల్వే మంత్రిగా ఉన్న స‌మ‌యంలో లాలూ ఫ్యామిలీ అక్ర‌మాల‌కు పాల్ప‌డిన‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి. రైల్వే శాఖ‌లో ఉద్యోగాలు ఇచ్చేందుకు బ‌దులుగా త‌క్కువ ధ‌ర‌కే భూముల్ని కొన్న‌ట్లు కేసులు న‌మోదు అయిన విష‌యం తెలిసిందే. ఆ కేసులో లాలూ విచార‌ణ‌కు హాజ‌ర‌వుతున్నారు. అక్ర‌మ ప‌ద్ధ‌తిలో రైల్వేశాఖ‌లో రిక్రూట్మెంట్ జ‌రిగిన‌ట్లు ఈ కేసులో విచార‌ణ చేప‌ట్టిన సీబీఐ త‌న ఛార్జిషీట్‌లో పేర్కొన్న‌ది. అయితే విచార‌ణ కోసం ఇటీవ‌ల అధికారులు ఢిల్లీలోని పండారా పార్క్‌కు వెళ్లారు.