తెలంగాణలో పర్యటించనున్న కేంద్ర మంత్రులు

Union Ministers Nirmala Sitharaman, Mahendra Nath Pandey to visit Telangana

న్యూఢిల్లీః కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ పార్లమెంట్ ప్రవాస్‌ యోజన కార్యక్రమంలో భాగంగా ఈరోజు నుండి మూడు రోజుల పాటు జహీరాబాద్ పార్లమెంట్‌ నియోజకవర్గంలో పర్యటించనున్నట్లు బిజెపి వెల్లడించింది. మూడు, నాలుగో తేదీల్లో కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి మహేంద్రనాథ్‌ పాండే మహబూబ్‌నగర్‌ పార్లమెంట్‌ నియోజకవర్గంలో పర్యటించనున్నట్లు.. బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్‌ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. పర్యటనలో భాగంగా పేద, బడుగు బలహీన వర్గాలకు కేంద్ర ప్రభుత్వ పథకాల గురించి వివరించడం సహా వారికి అందుతున్న విధానాన్ని కేంద్రమంత్రులు అడిగి తెలుసుకోనున్నారు. ఇదే సమయంలో రాష్ట్రానికి కేంద్రం ఇస్తున్న నిధుల వినియోగం గురించి తెలుసుకోనున్నట్లు గుజ్జుల ప్రేమేందర్‌ రెడ్డి వెల్లడించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలతో వివిధ సమావేశాల్లో ఆయన పాల్గొననున్నట్లు తెలిపారు.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/andhra-pradesh/