సీఎం జగన్ కు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ లేఖ

సెంట్రల్ జైలు స్థలంలో నిర్మాణం చేపట్టాలన్న ఉండవల్లి

అమరావతి: రాజమండ్రిలోని ఆర్ట్స్ కాలేజీ ఆవరణలో క్రికెట్ స్టేడియంను నిర్మించాలనే ప్రతిపాదన చర్చనీయాంశంగా మారింది. ఇదే విషయంపై సీఎం జగన్ కు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ లేఖ రాశారు. ఆర్ట్స్ కాలేజీలో క్రికెట్ స్టేడియం నిర్మాణానికి తాను వ్యతిరేకమని సీఎంకు రాసిన లేఖలో ఉండవల్లి స్పష్టం చేశారు. సెంట్రల్ జైలు స్థలంలో స్టేడియం నిర్మాణాన్ని చేపట్టాలని సూచించారు. మరి ఈ అంశంలో సీఎం జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.

తాజా సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి: