అర్ధరాత్రి మహిళను లైంగికంగా వేధించిన వైసీపీ నేత

ఏపీలో రోజు రోజుకు ఆడవారికి రక్షణ లేకుండా పోతుంది. కామాంధులు ఒంటరిగా మహిళా కనిపించిన , పక్కన భర్త ఉన్న , ఆఖరకు అభం శుభం తెలియని చిన్నారి పైన కూడా అగాయిత్యాలు చేస్తూ వస్తున్నారు. ప్రభుత్వాలు , పోలీసులు , చట్టాలు ఎన్ని కఠిన శిక్షలు విదిస్తున్నప్పటికీ వారిలో భయం , మార్పు రావడం లేదు.

తాజాగా అధికార పార్టీ ప్రతినిధి అర్ధరాత్రి ఒంటరి మహిళా ఫై లైంగికంగా వేధించిన ఘటన శేషాద్రి పట్టణంలో చోటుచేసుకుంది. సదరు మహిళా కు తరుచు ప్రేమిస్తున్నానని ఫోన్లు చేస్తూ వస్తున్నాడు. వాటిని ఆమె పట్టించుకోకపోవడంతో అర్ధరాత్రి ఇంటికి వెళ్లి తలుపులు బాదుతూ.. బయటకు రావాలని ఇంటిపై రాళ్లు విసిరాడు. ఈ క్రమంలో సదరు మహిళా ఆ కౌన్సిలర్ ఫై పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు తనకు న్యాయం చేయకుంటే.. ఆత్మహత్య చేసుకుంటానని తెలిపింది.