సామ్నా పత్రిక ఎడిటర్గా ఉద్ధవ్ ఠాక్రే సతిమణి
మూడు నెలల క్రితం ఎడిటర్ బాధ్యతల నుండి తప్పుకున్న ఉద్ధవ్ ఠాక్రే
ముంబయి: మహారాష్ట్రలో శివసేన పార్టీ ..తన అధికార పత్రిక అయిన సామ్నాకు కొత్త ఎడిటర్ నియమించింది. సామ్నా పత్రిక కొత్త ఎడిటర్ గా మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే భార్య రష్మీ ఠాక్రే ఆదివారం నాడు బాధ్యతలు స్వీకరించారు. దాదాపు మూడు నెలల క్రితం సామ్నా ఎడిటర్ బాధ్యతల నుంచి ఉద్ధవ్ ఠాక్రే తప్పుకున్నారు. నవంబర్ 28న ఆయన ఎడిటర్ పదవి నుంచి రాజీనామా చేశారు. ఇన్ని రోజుల తర్వాత రష్మీ ఠాక్రేను ఎడిటర్గా ప్రకటించారు. శివసేన ఎంపీ సంజ§్ు రౌత్ సామ్నా ఎగ్జిక్యూటివ్ ఎడిడటర్గా కొనసాగుతారని ఆ పార్టీ స్పష్టం చేసింది. సామ్నా పత్రికను 1989లో ఉద్ధవ్ ఠాక్రే తండ్రి అయిన బాల్ ఠాక్రే తీసుకొచ్చారు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/