విజయనగరం జిల్లాలో దారుణం : పోలీస్ అంటూ చెప్పి గిరిజన బాలికలపై అత్యాచారం

విజయనగరం జిల్లా కురుపాంలో దారుణం చోటుచేసుకుంది. నేను పోలీస్ అంటూ ఒట్టిగెడ్డ రిజర్వాయర్‌ విహారయాత్ర ముగించుకుని తిరిగి వెళ్తుండగా బాలికలను బెదిరించి రాంబాబు అనే వ్యక్తి వారిపై అత్యాచారం చేశాడు.

వివరాల్లోకి వెళ్తే..2022 జనవరి 1న మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీకి చెందిన ఇద్దరు విద్యార్థినులు, మరో ఇద్దరు విద్యార్థులు మొత్తం నలుగురు ఒట్టిగెడ్డ రిజర్వాయర్ కు విహార యాత్రకు వెళ్లారు. సాయంత్రం తిరుగు ప్రయాణంలో నడుచుకుంటూ వస్తుండగా రాంబాబు అనే వ్యక్తి వారిని అడ్డుకొని..నేను పోలీస్ అని వారిని బెదిరించి తోటలోకి తీసుకెళ్లాడు.

ఇద్దరు విద్యార్ధులను అక్కడే కూర్చొబెట్టారు. మిగిలిన ఇద్దరు విద్యార్థినులను సమీపంలోని ఫామ్ ఆయిల్ తోటలోకి తీసుకెళ్లి వారిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. రాత్రి జూనియర్ కాలేజీకి చేరుకున్న విద్యార్థులు జరిగిన ఘటనను కాలేజీ సిబ్బందికి తెలుపడం తో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగం ప్రవేశం చేసిన పోలీసులు పూర్తి వివరాలను సేకరించిన తర్వాత నిందితుడు రాంబాబును అదే రాత్రే అదుపులోకి తీసుకున్నారు. అయితే నిందితుడు రాంబాబు గతంలో కూడా పలుమార్లు ఇలాంటి ఘటనలకు పాల్పడినట్లుగా అతనిపై ఆరోపణలు ఉన్నాయి. నిందితుడు రాంబాబుపై కఠిన చర్యలు తీసుకోవాలని గిరిజన సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.