తెలంగాణ కాంగ్రెస్ కు భారీ షాక్‌..కీలక నేతలు పార్టీకి రాజీనామా

కర్ణాటక ఎన్నికల్లో విజయం సాధించడం తో తెలంగాణ కాంగ్రెస్ లో జోష్ పెరిగింది. కర్ణాటక లో ఎలాగైతే విజయం సాధించామో..తెలంగాణ లో కూడా విజయం సాధించాలని పార్టీ అధిష్టానం చూస్తుంది. ఈ నేపథ్యంలో పార్టీ లోని నేతలకు స్పీడ్ చేసారు. అలాగే ఇతర పార్టీల్లోని నేతలను పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. ఈ తరుణంలో టీ కాంగ్రెస్ కు భారీ షాక్ ఇచ్చారు మాజీ ఎమ్మెల్యేలు. ఇద్దరు కీలక నేతలు పార్టీ కి రాజీనామా చేయడం అందర్నీ షాక్ లో పడేసింది.

చెన్నూరు మాజీ ఎమ్మెల్యే సత్కు సంజీవ రావు, బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే అమరాజుల శ్రీదేవి లు పార్టీకి రాజీనామా చేసారు. ఈ ఇద్దరు త్వరలో బిజెపి లో చేరనున్నట్లు తెలుస్తుంది. తెలంగాణ బీజేపీ చీఫ్‌ కిషన్ రెడ్డి, బండి సంజయ్ లను కలవబోతున్నారు. ఇక ఇప్పటికే బీజేపీ నేత మాజీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి తో భేటీ అయ్యారు ఈ ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు. రేపు లేదా ఎల్లుండి.. చెన్నూరు మాజీ ఎమ్మెల్యే సత్కు సంజీవ రావు, బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే అమరాజుల శ్రీదేవి బీజేపీ పార్టీ చేరే ఛాన్స్‌ ఉందని అంటున్నారు.