మొహర్రం సందర్భంగా పాతబస్తీలో ట్రాఫిక్ ఆంక్షలు

మొహర్రం సందర్భంగా హైదరాబాద్ పాతబస్తీలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు. ఈరోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు పాతబస్తీలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని తెలిపారు. ట్రాఫిక్ ఆంక్షలతో పలు ప్రాంతాల్లో వాహనాల మళ్లింపు ఉంటుందని.. వాహనదారులు ఆంక్షలు గమనించి ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని సూచించారు.

పాతబస్తీలోని సర్దార్‌మహల్‌, చార్మినార్‌, గులార్‌హౌస్‌, పురానాహవేలీ, ఇమ్లిబన్‌ బస్టాండ్‌, చాదర్‌ఘాట్‌ ప్రాంతాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు అమలులో ఉంటాయని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. ఈ నేపథ్యంలో వాహనదారులు ఆయా సమయాల్లో ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని సూచించారు. మొహర్రం ఊరేగింపు సందర్భంగా నగరంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పోలీసులు చర్యలు తీసుకున్నారు.