అల్లు అర్జున్ వల్ల ఇద్దరు కానిస్టేబుళ్ల పై వేటు
![pushpa streaming rights](https://www.vaartha.com/wp-content/uploads/2022/01/Allu-Arjun-in-Pushpa.jpg)
ఏపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా అల్లు అర్జున్..నంద్యాల వైసీపీ అభ్యర్థి కి మద్దతు ఇవ్వడం ఏమోకానీ ఈ పర్యటన వల్ల పోలీసులకు పెద్ద తలనొప్పి వచ్చి పడింది. అల్లు అర్జున్ పర్యటన వివాదంపై ఇద్దరు కానిస్టేబుళ్ల పై వేటు పడింది. కానిస్టేబుళ్లు స్వామి నాయక్, నాగరాజు ను వీఆర్ కు పంపిస్తూ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. భారీ జన సమీకరణ జరుగుతుందని సమాచారాన్ని ముందుగా ఇవ్వలేదని కానిస్టేబుళ్లపై చర్యలు తీసుకున్నారు.
ఈ సంఘటన పై ఎస్పీ రఘువీర్ రెడ్డి, డీఎస్పీ రవీందర్ రెడ్డి, టూ టౌన్ సీఐ రాజారెడ్డిలకు కేంద్ర ఎలక్షన్ కమిషన్ నోటీసులు జారీ చేసింది. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పటికీ అంత మంది జనసమీకరణ చేయడంపై ఎలక్షన్ కమిషన్ సీరియస్ అయ్యింది. అనుమతి లేకుండా జనాలు అధిక సంఖ్యలో శిల్పా రవి ఇంటికి చేరుకోవడంతో స్థానిక నేతలు వారందరిని తీసుకుని వచ్చినట్లు ఆరోపిస్తూ స్థానిక రిటర్నింగ్ అధికారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు అల్లు అర్జున్, శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి మీద పోలీసులు కేసు నమోదు చేశారు.