తిరుమల భక్తులకు తీపి కబురు..భక్తులకు ధనప్రసాదం అందజేస్తున్న టీటీడీ

తిరుమల భక్తులకు తీపి కబురు తెలిపారు టీటీడీ. ఇక నుండి ధనప్రసాదం పేరుతో భక్తులకు హుండీ నాణేలు అందజేస్తున్నారు. శ్రీవారి హుండీలో కానుకల రూపంలో భక్తులు సమర్పించే చిల్లర నాణేలను ‘ధన ప్రసాదం’ రూపంలో భక్తులకే ఇవ్వాలని నిర్ణయించింది. ప్రతిరోజు స్వామివారి హుండీలో రూ. 10 నుంచి 20 లక్షల వరకు చిల్లర నాణేలు వస్తుంటాయి. ఈ చిల్లరను తీసుకునేందుకు బ్యాంకులు కూడా ముందుకు రావడం లేదు. ఈ నేపథ్యంలో టీటీడీ శ్రీవారికి భక్తులు సమర్పించిన నాణేలను వారికీ అందజేయాలని డిసైడ్ అయ్యింది. తిరుమలలో అతిథిగృహాల రిసెప్షన్ కేంద్రాల వద్ద ధన ప్రసాదం రూపంలో నాణేలను 100 రూపాయల పాకెట్ల రూపంలో కవర్లలో అందిస్తోంది.

అకామడేషన్ బుకింగ్ సమయంలో చెల్లించిన కాషన్ డిపాజిట్ ను శ్రీవారి ధన ప్రసాదం రూపంలో తిరిగి తెల్లించేలా కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ రోజు ప్రారంభించిన ఈ కార్యక్రమంలో ప్రస్తుతం ఒక రూపాయి నాణేలను ఇస్తున్నారు. రానున్న రోజుల్లో 2, 5 రూపాయల నాణేలను కూడా ఇవ్వనున్నారు.