చిన్నారులకు టీఎస్ఆర్టీసీ తీపి కబురు…

టీఎస్ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు తీసుకున్న దగ్గరి నుండి ఎన్నో తీపి కబుర్లు అందజేస్తున్న సజ్జనార్..ఈరోజు చిల్డ్రన్స్ డే సందర్భాంగా చిన్నారులకు తీపి కబురు తెలిపి వారిలో , వారి కుటుంబంలో సంతోషం నింపారు. ఈరోజు చిల్డ్రన్స్ డే సందర్భంగా.. 15 ఏళ్ల లోపు పిల్లలకు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణించవచ్చని తెలిపింది. ఈ విషయనాన్ని ట్విట్టర్ వేదికగా అధికారికంగా ప్రకటించింది టీఎస్ఆర్టీసీ.

ఇందుకు సంబంధించిన నిర్ణయాన్ని ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి.. ఎండీ సజ్జనార్ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలిపింది. ఇవాళ 15 ఏళ్ళలోపు చిన్నారులు ఆర్టీసీకి చెందిన ఏసీ, మెట్రో, డీలక్స్, ఆర్డినరీ.. ఏ బస్సులో ప్రయాణించిన టికెట్ అవసరం లేదని తెలిపారు. టీఎస్ఆర్టీసీ తీసుకున్న ఈ నిర్ణయంపై నెటిజన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పెళ్లిళ్లకు బస్సులను బుక్ చేసుకుంటే నూతన వధువరులకు బహుమతులు ఇవ్వనున్నట్లుగా ప్రకటించింది టీఎస్ఆర్టీసీ. అంతేకాకుండా.. ముందస్తు అడ్వాన్స్ లేకుండానే వివాహాలకు బస్సులు బుక్ చేసుకోవచ్చని తెలిపి ఆనందం నింపిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు ఈ ప్రకటన తో సంబరాలు చేసుకుంటున్నారు.