గణేష్ నిమజ్జనం నేపథ్యంలో నగరంలో ప్రత్యేక ఆర్టీసీ , MMTS సర్వీసులు

ఎల్లుండి (సెప్టెంబర్ 28) గణేష్ నిమజ్జనం నేపథ్యంలో హైదరాబాద్ లో ప్రత్యేక సర్వీసులు నడిపేందుకు ఆర్టీసీ తో పాటు MMTS సిద్ధమైంది. హైదరాబాద్ లో గణేష్ నిమజ్జన వేడుకలు ఎంత ఆర్భాటంగా నడుస్తాయి అనేది చెప్పాల్సిన పనిలేదు. ఈ నిమజ్జన కార్యక్రమాలను చూసేందుకు నగరవాసులే కాదు యావత్ ప్రజానీకం హైదరాబాద్ కు తరలివస్తారు. ఈ తరుణంలో ఆర్టీసీ తో పాటు MMTS ప్రత్యేక సర్వీస్ లను సిద్ధం చేసింది.

మొత్తం 535 ప్రత్యేక బస్సులను టీఎస్ఆర్టీసీ నడపనుందని సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ వెల్లడించారు. జీహెచ్‌ఎంసీ పరిధిలోని ఒక్కో డిపో నుంచి 15 నుంచి 20 బస్సులను ఏర్పాటు చేసి నిమజ్జనం, శోభాయత్ర సమయంలో భక్తులకు ఇబ్బంది లేకుండా టీఎస్ ఆర్టీసీ చర్యలు చేపట్టింది. వినాయకుడి నిమజ్జనంలో పాల్గొనే భక్తుల రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సంస్థ అన్ని చర్యలు తీసుకుంది. ప్రత్యేక బస్సులకు సంబంధించిన సమాచారం కోసం రెతిఫైల్‌ బస్‌ స్టేషన్‌లో 9959226154, కోఠి బస్‌ స్టేషన్‌లో 9959226160 నంబర్లను సంప్రదించాలని సంస్థ ఎండీ సజ్జనార్ సూచించారు.

అలాగే నిమజ్జన రోజు MMTS సైతం ప్రత్యేక సర్వీస్ లను సిద్ధం చేసింది. ఈ నెల 28వ తేదీ రాత్రి 11 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 4 గంటల వరకు ఈ స్పెషల్ సర్వీసులు నడపనున్నారు. ఆ ఎంఎంటీఎస్ రైళ్ల వివరాలు ఇలా ఉన్నాయి.

Train No.GSH-5: హైదరాబాద్-లింగంపల్లి ఎంఎంటీఎస్ స్పెషల్ ట్రైన్ ఈ నెల 28న రాత్రి 11 గంటలకు బయలుదేరి.. మరుసటి రోజు 23.50 గంటలకు గమ్యానికి చేరుకుంటుంది.

Train No.GSH-1: సికింద్రాబాద్-హైదరాబాద్ ఎంఎంటీఎస్ స్పెషల్ ట్రైన్ ఈ నెల 28వ తేదీ రాత్రి 11.50 గంటలకు సికింద్రాబాద్ లో బయలుదేరి.. మరుసటి రోజు 00:20 గంటలకు హైదరాబాద్ కు చేరుకుంటుంది.

Train No.GLF-6: లింగంపల్లి-ఫలక్ నూమా ఎంఎంటీఎస్ స్పెషల్ ట్రైన్ఈ నెల 29న ఉదయం 12.10 గంటలకు లింగంపల్లి నుంచి బయలుదేరి.. 01:50 గంటలకు గమ్యానికి చేరుకుంటుంది.

Train No.GHL-2: హైదరాబాద్-లింగంపల్లి ఎంఎంటీఎస్ స్పెషల్ ట్రైన్ ను ఈ నెల 29న ఉదయం 12:30 గంటలకు బయలుదేరి.. 01:20 గంటలకు లింగంపల్లికి చేరుకుంటుంది.

Train No.GLH-3: లింగంపల్లి-హైదరాబాద్ ఎంఎంటీఎస్ స్పెషల్ ట్రైన్ ఈ నెల 29న ఉదయం 01:50 గంటలకు బయలుదేరి.. 02:00 గంటలకు గమ్యానికి చేరుకుంటుంది.

Train No.GFS-7: ఫలక్ నూమా-సికింద్రాబాద్ ఎంఎంటీఎస్ స్పెషల్ ట్రైన్ ఈ నెల 29న 02:20 గంటలకు బయలుదేరి.. మరుసటి రోజు 03:30 గంటలకు గమ్యానికి చేరుకుంటుంది.

Train No.GHS-4: హైదరాబాద్-సికింద్రాబాద్ ఎంఎంటీఎస్ స్పెషల్ ట్రైన్ ను ఈ నెల 29న నడపనుంది దక్షిన మధ్య రైల్వే. ఈ స్పెషల్ ఎంఎంటీఎస్ ట్రైన్ 03:30 గంటలకు బయలుదేరి.. మరుసటి రోజు 04:00 గంటలకు సికింద్రాబాద్ కు చేరుకుంటుంది.