మరో మూడు రోజుల పాటు పాఠశాలలకు సెలవులు పొడిగింపు?
ఇప్పటికే 3 రోజుల పాటు విద్యాలయాలకు సెలవులు
హైదరాబాద్ః తెలంగాణలో గత కొన్ని రోజులు భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పటికే 3 రోజుల పాటు రాష్ట్రంలోని అన్ని విద్యాలయాలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించిన సంగతి తెలిసిందే. సోమవారం నుంచి మొదలైన ఈ సెలవులు నేటితో ముగియనున్నాయి. అయితే 3 రోజులుగా కురుస్తున్న వర్షాలు ఇంకా తెరిపి ఇవ్వలేదు. మరో నాలుగైదు రోజులు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.
ఈ నేపథ్యంలో మరో 3 రోజుల పాటు విద్యాలయాలకు సెలవులు ఇచ్చే దిశగా ప్రభుత్వం యోచిస్తోంది. ఇప్పటికే ఈ సెట్ పరీక్షలను వాయిదా వేసిన ప్రభుత్వం… రేపటి నుంచి మొదలు కానున్న ఎంసెట్ పరీక్షలను కూడా వాయిదా వేస్తూ బుధవారం కీలక నిర్ణయం తీసుకుంది. అదే సమయంలో విద్యాలయాలకు మరో 3 రోజుల పాటు సెలవులు ప్రకటించే దిశగా ప్రభుత్వం ఆలోచిస్తోంది. బుధవారం సాయంత్రం తాజా వాతావరణ పరిస్థితులపై చర్చించి ఈ దిశగా ప్రభుత్వం ప్రకటన చేసే అవకాశం ఉంది. ఇదే జరిగితే… వర్షాల కారణంగా విద్యాలయాలకు వరుసగా 6 రోజుల పాటు సెలవులు ప్రకటించినట్టవుతుంది.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండిః https://www.vaartha.com/news/national/