ఏప్రిల్ నాటికి అందరికీ సరిపడా వ్యాక్సిన్
వ్యాక్సిన్కు అనుమతి లభించిన వెంటనే ఉత్పత్తి ప్రారంభం..ట్రంప్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ వైట్హౌస్లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. వచ్చే సంవత్సరం ఏప్రిల్ నాటికి అమెరికా పౌరులందరికీ సరిపడా కరోనా వ్యాక్సిన్ డోసులు అందుబాటులో ఉంటాయని తెలిపారు. వ్యాక్సిన్కు అనుమతులు లభించిన వెంటనే దేశంలోని పౌరులందరికీ అందుబాటులోకి వచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు. నెలకు లక్షలాది డోసులు ఉత్పత్తి చేస్తామని, వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి అందరికీ సరిపడా డోసులు అందుబాటులోకి వస్తాయని భావిస్తున్నట్టు చెప్పారు. దేశంలో తిరిగి సాధారణ పరిస్థితులు నెలకొనాలంటే అందుకు వ్యాక్సిన్ ఒక్కటే మార్గమన్న ట్రంప్.. ప్రస్తుతం మూడు వ్యాక్సిన్లు తుది దశ క్లినికల్ ట్రయల్స్కు సిద్ధమైనట్టు చెప్పారు. టీకా కనుక అందుబాటులోకి వస్తే ప్రజల ప్రాణాలకు ఉన్న ముప్పు తొలగిపోవడమే కాకుండా, అనేక రకాల ఆంక్షల నుంచి విముక్తి లభిస్తుందని ట్రంప్ పేర్కొన్నారు.
తాజా కెరీర్ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/specials/career/