పీయూష్ గోయల్ పై సభాహక్కుల ఉల్లంఘన తీర్మానం
పార్లమెంట్ ఉభయ సభల్లో టిఆర్ఎస్ ఎంపీలు
New Delhi: పార్లమెంట్ ఉభయ సభల్లో టిఆర్ఎస్ ఎంపీలు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ పై సభాహక్కుల ఉల్లంఘన తీర్మానం ఇచ్చారు. సోమవారం రాజ్యసభలో ప్రశ్నోత్తరాల సమయంలో పీయూష్ గోయల్ సమాధానం పార్లమెంట్ ను తప్పుదోవ పట్టించేలా ఉందని టిఆర్ఎస్ ఎంపీలు అన్నారు. డబ్ల్యూటివో నియమావళి నేపథ్యంలో పారా బాయిల్డ్ రైస్ విదేశాలకు ఎగుమతులు చేయలేమని కేంద్ర మంత్రి సభను తప్పుదోవ పట్టించారని పేర్కొన్నారు. అయితే, కేంద్ర ప్రభుత్వ వెబ్ సైట్ లో మిలియన్ టన్నుల పారా బాయిల్డ్ రైస్ విదేశాలకు ఎగుమతి చేసినట్లు ఉందని ఎంపీలు గుర్తుచేశారు.
తెర (సినిమా) వార్తల కోసం: https://www.vaartha.com/news/movies/