మునుగోడు లో కేసీఆర్ గడియారాలను పంచడం స్టార్ట్ చేసారు

మునుగోడు ఉప ఎన్నిక..ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి రేపుతోంది. ఈ ఉప ఎన్నికను టిఆర్ఎస్ , బిజెపి , కాంగ్రెస్ పార్టీలు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఎలాగైనా ఈ ఉప ఎన్నికలో గెలిచి తీరాలని సన్నాహాలు చేస్తున్నాయి. ఇంకా ఉప ఎన్నిక నోటిఫికేషన్ రాకముందే ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. సభలు , సమావేశాలతో ఓటర్లను ఆకట్టుకునే పనిలో పడ్డారు. ఇక అధికార పార్టీ నేతలు అయితే ఓ అడుగు ముందుకేసి గోడ గడియారాలు పంచడం మొదలుపెట్టారు.

చౌటుప్పల్ మండలం, సంస్థన్ నారాయణపురం మండలంలో టీఆర్ఎస్ నాయకులు సీఎం కేసీఆర్, కారు బొమ్మతో ఉన్న గడియారాలను ఇంటింటికీ పంపిణీ చేస్తున్నారు. చౌటుప్పల్ మున్సిపాలిటీలో ఇప్పటికే సుమారు 8, 000 గడియారాలను అన్ని వార్డులలో పంపిణీ చేశారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఇక టిఆర్ఎస్ నుండి ఎవరు అభ్యర్థి అనేది ఇంకా క్లారిటీ రాలేదు. బిజెపి నుండి కోమటిరెడ్డి రాజగోపాల్ బరిలోకి దిగుతున్నాడు. కాంగ్రెస్ పార్టీ నుండి ఎవరు అనేది అతి త్వరలో తెలియజేస్తామని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రకటించారు.