ధర్పల్లిలో ఉద్రిక్తత… రాళ్లు రువ్వుకున్నటీఆర్ఎస్, బీజేపీ శ్రేణులు

ధర్పల్లి: నిజామాబాద్ జిల్లా ధర్పల్లిలో శివాజీ విగ్రహావిష్కరణ ఉద్రిక్తతకు దారితీసింది. టీఆర్ఎస్, బీజేపీ శ్రేణులు పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు. పోలీసులు భారీగా మోహరించి ఇరు వర్గాలను చెదరగొట్టారు. అయితే, రాళ్ల దాడిలో ఎస్సై, ఇద్దరు కానిస్టేబుళ్లతో పాటు ఎనిమిది మందికి గాయాలయ్యాయి. ధర్పల్లిలో శివాజీ విగ్రహ ఆవిష్కరణకు ఎంపీ అర్వింద్ శనివారం వెళ్లాల్సి ఉంది. అయితే, పోలీసులు ఈ కార్యక్రమానికి అనుమతి నిరాకరించారు. కానీ టీఆర్ఎస్ నాయకులు భారీ ర్యాలీతో వెళ్ళి విగ్రహాన్ని ఆవిష్కరించారు. విషయం తెలిసి బీజేపీ శ్రేణులు పెద్దసంఖ్యలో చేరుకొని మరో సారి ఆవిష్కరించారు. దీనితో అక్కడే ఉన్న టీఆర్ఎస్ శ్రేణులు విగ్రహం వద్దకు వెళ్ళడానికి యత్నించారు. ఈ క్రమంలోఇరుపార్టీల కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/international-news/