నేటితో ముగియనున్న మేడారం జాతర

వరంగల్: నాలుగు రోజుల పాటు ఎంతో వైభవంగా జరిగిన మేడారం మహా జాతర నేటితో ముగియనుంది. ఇవాళ సాయంత్రం వన దేవతలైన సమక్క, సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజు వనప్రవేశం చేయనున్నారు. సమ్మక్కను చిలుకల గుట్టకు, సారాలమ్మను కన్నేపల్లికి, గోవిందరాజును కొండాయికి, పగిడిద్దరాజు ను పూనుగొండ్లకు సాగనంపనున్నారు ఆదివాసీ పూజారులు. మంత్రులు మొదలుకొని ప్రభుత్వ యంత్రాంగం అక్కడే ఉండి మేడారం మహాజాతరకు ఎలాంటి ఆటంకాలు కలుగకుండా పటిష్టం చర్యలు తీసుకున్నారు.

కాగా, భక్తుల రద్దీతో సీఎం కేసీఆర్ మేడారం టూర్ రద్దయింది. వనదేవతల జనజాతరకు వీఐపీల తాకిడి కూడా పెరిగింది. సీఎం రాకపోయినప్పటికి కేంద్ర, రాష్ట్ర మంత్రులు పలువురు సమ్మక్క సారలమ్మ దర్శించుకుని మొక్కులు చెల్లించారు. తెలంగాణ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, గంగుల కమలాకర్, మల్లారెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు అమ్మవారులకు బంగారం సమర్పించి మొక్కులు చెల్లించారు. అయితే, వీఐపీల తాకిడి, భక్తుల రద్దీతో కొన్ని ఇబ్బందులు తప్పలేదు. కొన్ని సందర్భాల్లో కంట్రోల్ చేయడం పోలీసులకు తలనొప్పింగా మారింది. జనంలోకి వచ్చిన వనదేవతలు, మళ్లీ వనంలోకి వెళ్లేవరకు రద్దీ ఉంటుందని అంచనా వేస్తున్నారు అధికారులు. అందుకు తగ్గట్టుగానే ఏర్పాట్లు చేస్తున్నారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/