నేడు మునుగోడులో నామినేషన్లు వేయనున్న టిఆర్ఎస్, బిజెపి అభ్యర్థులు..
హైదరాబాద్ః మునుగోడులో నామినేషన్ల సందడి ప్రారంభమైంది. ఈ నేపథ్యంలోనే ఈరోజు టిఆర్ఎస్, బిజెపి అభ్యర్థులు నామినేషన్లు వేయనున్నారు. ఉదయం 11 గంటలకు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నామినేషన్ వేస్తారు. మధ్యాహ్నం టిఆర్ఎస్ క్యాండేట్ కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి నామినేషన్ సమర్పిస్తారు. ఈ నెల 14 వరకు నామినేషన్ల దాఖలుకు గడువు ఉంది. ఇప్పటివరకూ ఒకే ఒక నామినేషన్ మాత్రమే పడింది. భారీ ర్యాలీతో నామినేషన్ వేసేందుకు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రెడీ అవుతున్నారు.
ఈ కార్యక్రమానికి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్,పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ తరుణ్చుగ్తో పాటూ స్టీరింగ్ కమిటీ ఛైర్మన్ వివేక్, ఈటల రాజేందర్, కేంద్రమంత్రులు కిషన్రెడ్డి, భుపేంద్ర యాదవ్, లక్ష్మణ్, డీకే. అరుణ హాజరుకానున్నారు. వీరితో పాటు మునుగోడు బిజెపి స్టీరింగ్ కమిటీ నేతలు హాజరవుతారు. ఇటు టిఆర్ఎస్ అభ్యర్థిగా ప్రభాకర్ రెడ్డి కూడా భారీ ర్యాలీతో నామినేషన్ వేయనున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులతో పాటు టిఆర్ఎస్ సీనియర్ నేతలు పాల్గొంటారు. మునుగోడు నుంచి చండూరు వరకు భారీ ర్యాలీతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని పార్టీ నిర్ణయించింది.
తాజా ఏపి వార్తల కోసం క్లిక్ చేయండిః https://www.vaartha.com/andhra-pradesh/