తాడిపత్రిలో ఘోర ప్రమాదం..ముగ్గురు మృతి

తాడిపత్రిలో ఘోర ప్రమాదం నలుగుర్ని బలి తీసుకుంది. కొత్త కార్ కొన్న యువకుడు..తన స్నేహితులకు పార్టీ ఇచ్చాడు. పార్టీ అవ్వగానే టిజి ఇంటికి వెళ్తుండగా..కారు అదుపు తప్పి చెట్టును ఢీ కొట్టింది.అంతే ఈ ప్రమాదం లో ముగ్గురు అక్కడిక్కడే మృతి చెందారు. ప్రస్తుతం ఈ ఘటన ఆ ఫ్యామిలీలో విషాదాన్ని నింపింది.

వివరాల్లోకి వెళ్తే..

తాడిపత్రికి చెందిన మోహన్‌ రెడ్డి ఇటీవల కొత్త కారు కొనుగోలు చేశాడు. ఈ సందర్భంగా తన స్నేహితులకు శుక్రవారం రాత్రి విందు(Party) ఏర్పాటు చేశాడు. ఇక పార్టీ ముగించుకుని తిరిగి వస్తుండగా కారు ప్రమాదానికి గురయ్యింది. ఆ యాక్సిడెంట్‌లో కారు నడుపుతున్న మోహన్‌రెడ్డితో పాటు విష్ణువర్ధన్‌, నరేశ్‌ రెడ్డి స్పాట్‌లోనే మ‌తి చెందగా..మరో యువకుడు శ్రీనివాసరెడ్డి తీవ్రంగా గాయపడ్డాడు. పార్టీలో మందు తాగి వేగంగా నడపడం వల్లే కారు అదుపు తప్పి రొడ్డు పక్కనే ఉన్న చెట్టును ఢీ కొట్టి ఉంటుందని, మృతదేహాలను ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు ఎస్సై మహమ్మద్‌ గౌస్‌ పేర్కొన్నారు.