నేడు శ్రీ గాయత్రిదేవిగా దుర్గమ్మ
ఇంద్రకీలాద్రిపై అలంకారం
”ముక్తా విద్రుమ హేమనీల ధవళచ్ఛాయై ముఖైస్త్రీ క్షణైః
యుక్తామిందు నిబద్ధరత్న మకుటాం తత్త్వార్ధ వర్ణాత్మికామ్
గాయత్రీం వరదాభయాంకుశకశాశ్శుభ్రంకపాలం గదాం
శంఖం చక్రమధార వింద యుగళం హసైర్వహం తీం భజే
అలంకారం :
అమ్మవారిని మెరూన్ (వక్కపొడి) వర్ణంతో ఉన్న పట్టుచీరతో అలంకరిస్తారు.
మంత్రం: ”ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్యసధీమహి ధియో యోనః ప్రచోదయాత్ అనే మంత్రాన్ని 108 సార్లు జపిస్తూ అమ్మను ధ్యానించాలి.
నైవేధ్యం: అల్లపు గారె నివేదన చేసి, గాయత్రీ స్తోత్రాలు పారాయణ చేయాలి.
అలాగే గాయత్రీ స్వరూపంగా వేదం చదువుకున్న బ్రాహ్మణులకు అర్చన చేయాలి.
తాజా బిజినెస్ వార్తల కోసం: https://www.vaartha.com/news/business/