గ్రీన్‌ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొన్న సల్మాన్ ఖాన్

గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ మొక్కలు నాటారు. సినిమా షూటింగ్ లో భాగంగా హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీ కి వచ్చిన సల్మాన్ ఖాన్.. ఎంపీ జోగినిపల్లి సంతోష్‌కుమార్‌తో కలిసి రామోజీ ఫిల్మ్ సిటీలో మొక్కలు నాటారు. ఒక్కో మొక్క ఒక్కో మనిషికి సరిపడా ఆక్సిజన్ అందిస్తుందన్నారు.

మొక్కలు నాటడాన్ని ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలని పిలుపునిచ్చాడు. ఏదో ఒక మొక్క నాటామా..పని అయిపోయిందా అనే విధంగా కాకుండా..మొక్కలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. అకాల వర్షాలు, వరదలు, విపత్తులతో కళ్ల ముందే చాలా మంది చనిపోతున్నారని..ఇది చాలా బాధాకరమన్నారు సల్మాన్.ఐదేళ్ల క్రితం తాను చేపట్టిన ఈ గ్రీన్ ఛాలెంజ్ ద్వారా ఇప్పటి వరకు 16 కోట్లకు పైగా మొక్కలు నాటించినట్లు సంతోశ్‌ తెలిపారు

భావి తరాలకు ఉపయోగపడే మంచి కార్యక్రమం చేపట్టారంటూ ఎంపీ సంతోశ్‌ కుమార్‌ను సల్మాన్‌ ప్రశంసించారు. 16 కోట్లు మొక్కలే కాదు… భవిష్యత్‌లో సంతోశ్‌ ఆశయంతో అమెజాన్‌ ఫారెస్ట్ తరహాలో పెద్ద వృక్షసంపద సమకూరుతుందని ప్రశంసించారు. గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌లో ప్రతి ఒక్కరూ పాల్గొని సంతోశ్‌ ఆశయానికి తోడ్పడాలని కోరారు. మొక్కల పెంపకంతోనే పర్యావరణ సమతుల్యం సాధ్యమని… పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొనాలని సల్మాన్‌ తన అభిమానులకు పిలుపునిచ్చారు. ప్రస్తుతం సల్మాన్ ..మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న గాడ్ ఫాదర్ లో ఓ కీలక పాత్ర చేస్తున్నాడు.