ఆట ప్రారంభంలోనే కోహ్లీ(44) అవుట్
మూడో రోజు టీమిండియాకు దెబ్బ

ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్లో న్యూజిలాండ్తో జరుగుతున్న మ్యాచ్లో మూడు రోజు ఆట ప్రారంభంలోనే భారత్ కు చుక్కెదురైంది. కెప్టెన్ విరాట్ కోహ్లీ వికెట్ కోల్పోయింది. కోహ్లీ (44) కివీస్ పేసర్ కైల్ జేమీసన్ బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూ అయ్యాడు. క్రీజులోకి వచ్చీ రాగానే పంత్ (4) వెనుదిరిగాడు. పంత్ వికెట్ కూడా జేమీసన్కే దక్కింది. భారత్ 156 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది.
తాజా ఆధ్యాత్మికం వ్యాసాల కోసం : https://www.vaartha.com/specials/devotional/