28న తిరుమల శ్రీవారి ఆలయం మూసివేత

Tirumala-Temple
Tirumala-Temple

తిరుమలః ఈ నెల 29న పాక్షిక చంద్రగ్రహణం నేపథ్యంలో 28న సాయంత్రం నుంచి తిరుమల శ్రీవారి ఆలయం మూతపడనుంది. దాదాపు 8 గంటలపాటు ఆలయ తలుపులు మూసివేస్తారు. ఈ నేపథ్యంలో ఆ రోజు శ్రీవారిని దర్శించుకోవాలనుకునే భక్తులు మరో రోజుకు వాయిదా వేసుకోవడం మేలు.

29న తెల్లవారుజామున 1.05 గంటలకు గ్రహణం మొదలై 2.22 గంటల వరకు కొనసాగుతుంది. గ్రహణ సమయానికి ఆరు గంటల ముందు ఆలయ తలపులు మూసివేయడం ఆనవాయితీ కావడంతో 28న రాత్రి 7.05 గంటలకు ఆలయ తలుపులు మూసివేస్తారు. 29న తెల్లవారుజామున ఏకాంతంలో ఆలయాన్ని శుద్ధిచేసి ఏకాంతసేవ నిర్వహిస్తారు. అనంతరం భక్తులను తిరిగి శ్రీవారి దర్శనానికి అనుమతిస్తారు.