ప్రయాణికులకు గుడ్ న్యూస్ తెలిపిన TSRTC
ప్రయాణికులకు మరో గుడ్ న్యూస్ తెలిపింది TSRTC . ముందస్తు టికెట్ల రిజర్వేషన్ చార్జీలు తగ్గించింది. దురా ప్రయాణం చేసే ప్రయాణికులు ముందస్తుగా రిజర్వేషన్ చేసుకుంటారు. మాములు టికెట్ ధర కంటే కాస్త ఎక్కువగా ఈ రిజర్వేషన్ చార్జీలు ఉంటాయి. అయితే ఇప్పుడు ఆ రిజర్వేషన్ చార్జీలను కొంతమేర తగ్గించింది. ఎక్స్ప్రెస్, డీలక్స్, సూపర్ లగ్జరీ, ఏసీ సర్వీసుల్లో చార్జీలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది.ఎక్స్పెస్, డీలక్స్ సర్వీసుల్లో 350 కిలో మీటర్లలోపు రూ.20గా, 350 ఆపై కిలోమీటర్లకు రూ.30గా చార్జీని నిర్ణయించింది.
సూపర్ లగ్జరీ ఏసీ సర్వీసుల్లో ముందస్తు రిజర్వేషన్ చేసుకుంటే రూ.30వసూలు చేయనుంది. ప్రతి రోజు సగటున 15 వేల వరకు ముందస్తుగా ప్రయాణికులు టికెట్లు రిజర్వేషన్ చేసుకుంటున్నారు. వారికి ఆర్థిక భారం తగ్గించేందుకు ముందస్తు రిజర్వేషన్ చార్జీలను తగ్గించామని టీఎస్ఆర్టీసీ ఛైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, ఎండీ వీసీ సజ్జనార్ తెలిపారు. ఈ వసతిని ప్రయాణికులంతా ఉపయోగించుకుని.. సంస్థను ఆదరించాలని కోరారు.