కలిసికట్టుగా కరోనాను తరిమేద్దాం.. ప్రధాని పిలుపు

pm modi

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోడి దేశంలోని క‌రోనా వైర‌స్‌ను క‌లిసిక‌ట్టుగా త‌రిమేద్దామ‌ని పిలుపునిచ్చారు. క‌రోనా నివార‌ణ‌కు ప్ర‌జ‌ల్లో భాగ‌స్వామ్యాన్ని ప్రోత్స‌హించేందుకు కేంద్రం జ‌న్ ఆందోళ‌న్ కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించింది. ఈ సంద‌ర్భంగా మోడి ట్వీట్ చేశారు. ప్ర‌తి ఒక్క‌రూ ఈ విష‌యాల‌ను గుర్తుంచుకోవాల‌ని ప్ర‌ధాని విజ్ఞ‌ప్తి చేశారు. ప్ర‌తి ఒక్క‌రూ మాస్కు ధ‌రించి.. భౌతిక దూరాన్ని పాటించాల‌న్నారు. నిత్యం చేతులు శుభ్రం చేసుకోవాల‌ని సూచించారు. ఇద్ద‌రి మ‌ధ్య‌ రెండు గ‌జాల దూరం ఉండేలా ప్రాక్టీస్ చేయండి. ఈ నియ‌మాలు పాటించి క‌రోనాపై విజ‌యం సాధిద్దామ‌ని ప్రధాని మోడి పిలుపునిచ్చారు.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/