నిర్లక్ష్యంగా కారు నడిపి మూడేళ్ల పాపను చంపేశాడు

నిర్లక్ష్యంగా కారు నడిపి మూడేళ్ల పాపను చంపేసిన ఘటన హయత్​నగర్​లోని లెక్చరర్స్ కాలనీలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. వనస్థలిపురం బీఎన్​రెడ్డి నగర్​లో నివాసం ఉండే రాజు, కవిత దంపతులకు బసవరాజు(6), లక్ష్మి(3) అనే చిన్నారులు ఉన్నారు. రాజు, కవిత హయత్​నగర్​లోని లెక్చరర్స్ కాలనీలో నిర్మాణంలో ఉన్న ఓ భవనం వద్ద పనిచేస్తున్నారు.

ఈ క్రమంలో కవిత తన కూతురు లక్ష్మిని ఆ భవనం వద్ద పడుకోబెట్టి పనులు చేస్తుండగా.. అటుగా వచ్చిన ఓ కారు డ్రైవర్ తన వెహికల్​ను రివర్స్ చేస్తూ నిద్రపోతున్న చిన్నారి తలపై నుంచి పోనిచ్చాడు. తీవ్రంగా గాయపడ్డ బాలికను వెంటనే హాస్పటల్ కు తరలించగా అప్పటికే ఆ పాప చనిపోయినట్లు డాక్టర్లు నిర్ధారించారు. పసిపాప మృతి చెందడంతో ఆ కుటుంబంలో విషాదంలో మునిగిపోయింది. ఈ ఘటన ఫై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టారు.