అఫ్ఘనిస్థాన్‌లో పేలుడు..ముగ్గురు పోలీసుల మృతి

IED blast
blast

కాబూల్‌: అఫ్ఘనిస్థాన్ ఈరోజు పేలుడు ఘటన సంభవించింది. ఈ ప్రమాదంలో ముగ్గురు పోలీసులు మరణించగా, మరో ఇద్దరు గాయపడ్డారు. సదరన్ అప్ఘాన్ ప్రావిన్సు పరిధిలోని కందహార్ లో శుక్రవారం ఉదయం రోడ్డుపై ఉన్న బాంబు పేలి ముగ్గురు పోలీసులు మరణించారు. రోడ్డుపై బాంబు పేలడంతో ముగ్గురు పోలీసులు అక్కడికక్కడే మరణించగా, మరో ఇద్దరు తీవ్రంగా గయాపడ్డారు. గాయపడిని వారిని ఆసుపత్రికి తరలించారు. ఈ పేలుడు ఘటనకు కారణమెవరనేది అధికారులు కాని, తాలిబన్ ఇస్లామిస్ట్ ఉద్యమకారులు కాని చెప్పలేదు. అఫ్ఘాన్ ప్రభుత్వ ప్రతినిధి బృందం దోహాలో తాలిబన్లతో సంప్రదింపులు జరుపుతోంది. ఒకవైపు చర్చలు సాగుతుండగానే , మరో వైపు పేలుళ్లు సాగుతున్నాయి. అఫ్ఘనిస్థాన్ దేశంలో తరచూ తాలిబిన్ల దాడులతో పలువురు మృత్యువాత పడుతున్నారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/