చంద్రబాబు లాంటి చీటర్ మరొకరు లేరు – మంత్రి రోజా

చంద్రబాబు లాంటి చీటర్ మరొకరు లేరంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు మంత్రి రోజా. రీసెంట్ గా చంద్రబాబు మినీ మేనిఫెస్టోను ఎన్టీఆర్ శత జయంతి సందర్భంగా రాజమండ్రి వేదికగా జరిగిన టీడీపీ మహానాడు సభలో ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మేనిఫెస్టో ఫై వైస్సార్సీపీ నేతలు స్పందిస్తూ వస్తున్నారు. తాజాగా ఏపీ మంత్రి రోజా స్పందించారు. బుధవారం ఆమె తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ… తమ పాలన చూసి చంద్రబాబుకు నవ నాడులు చిట్లి పోయాయంటూ మండిపడ్డారు. టీడీపీ ఛార్జ్‭షీట్‭ను ఆమె పిచ్చికి పరాకాష్టగా అభివర్ణించారు.

600 హామీలు ఇచ్చి, ఆరు హామీలు కూడా నెరవేర్చని వ్యక్తి చంద్రబాబని, ముఖ్యమంత్రి సంతకాలకు విలువ లేకుండా చేశారంటూ దుమ్మెత్తి పోశారు. ఆస్తి కోసం కుటుంబీకులను వేధించిన వ్యక్తి బోండా ఉమా అన్నారు. అమ్మఒడి పథకాన్ని ఎగతాళి చేసి, ఇప్పుడు మళ్లీ ఆ పథకం ఎందుకు మేనిఫెస్టోలో పెట్టారో చంద్రబాబు చెప్పాలన్నారు. నాలుగు తరాలు గుర్తు పెట్టుకునే విధంగా జగన్ నాలుగేళ్ల పాలన సాగిందన్నారు. 15 ఏళ్లు సీఎంగా కొనసాగి, తీరా ఇప్పుడు మహిళలకు నెలకు 1500 రూపాయలు ఇస్తాను అంటే టీడీపీని నమ్మేవారు ఎవరూ లేరని రోజా అన్నారు.