మైలార్​దేవ్​పల్లిలో పార్కు స్థలంఫై కన్నేసిన కబ్జా రాయుళ్లు

ఖాళీగా స్థలం కనిపిస్తే చాలు కబ్జారాయుళ్లు రెచ్చిపోతున్నారు. రాత్రికిరాత్రే దానిని కబ్జా చేస్తున్నారు. ఇక రాజకీయ నేతలు బలంతో కబ్జా రాయుళ్ల కబ్జా లు ఎక్కువై పోతున్నాయి. సామాన్య వ్యక్తుల స్థలాలతో పాటు ప్రభుత్వ భూములను సైతం వదలడం లేదు. తాజాగా మైలార్​దేవ్​పల్లిలో పార్కు స్థలంఫై కన్నేశారు.

మైలార్ దేవ్ పల్లి డివిజన్ శాస్త్రి పురం కాలనీలోని సర్వేనంబర్ 134/20 లో 1.34 ఎకరాల్లో పార్క్, ప్లేగ్రౌండ్‌‌‌‌‌‌‌‌ ఉంది. మార్చి 30వ తేదీ గురువారం ఉదయం 5 గంటల ప్రాంతంలో 4 జేసీబీలు, 2 టిప్పర్లతో అక్కడికి చేరుకున్న ఆక్రమణదారులు పార్క్ గోడలను కొంతవరకు కూల్చివేశారు. స్థానికులు అడ్డుకునేందుకు ప్రయత్నించగా వారిపై దాడికి పాల్పడ్డారు. దీంతో స్థానికులు జీహెచ్ఎంసీ, ఫారెస్ట్, పోలీస్ డిపార్ట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ అధికారులకు సమాచారం అందించారు.

ఘటనా స్థలానికి చేరుకున్న జీహెచ్ఎంసీ, ఫారెస్ట్ అధికారులు కూల్చివేతలు జరిగిన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు. కూల్చివేతలకు పాల్పడ్డ ఫలక్‌‌‌‌‌‌‌‌ నుమాకు చెందిన అసద్, అజ్జు ఖాన్‌‌‌‌‌‌‌‌ లను అదుపులోకి తీసుకున్నారు. జేసీబీలు, టిప్పర్ లతోపాటు వారు వచ్చిన బొలెరో వెహికల్​ను స్వాధీనం చేసుకున్నారు. కబ్జాదారుల వెనుక రాజకీయ నేతల హస్తం ఉందని స్థానికులు ఆరోపిస్తున్నారు.